Movies

సరికొత్త లుక్స్

Rashmika And Mahesh Try New Looks For Their Latest Combo

హాలిడే ముగిసింది. రెస్ట్ అయిపోయింది. మళ్లీ వర్క్ మోడ్కి షిఫ్ట్ అయ్యారు మహేశ్బాబు. నెక్ట్స్ చేయబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ పాత్రలోకి మారిపోవడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో మహేశ్ లుక్ టెస్ట్ జరుగుతోందని తెలిసింది. సినిమాలో మహేశ్బాబు ఏ లుక్తో కనిపించాలో ఈ లుక్ టెస్ట్లో డిసైడ్ అవుతారు. అలాగే చిత్రకథానాయిక రష్మికా మండన్నాపై కూడా ఫొటోషూట్ చేస్తున్నారట. విడివిడిగా ఇద్దరి లుక్ టెస్ట్ చేసి, జంటగా కూడా ఫొటోషూట్ జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర నిర్మించనున్నారు. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. కశ్మీర్, కర్నూల్ ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ జరగనుంది.