NRI-NRT

2019-20 మనబడి తరగతులు ప్రారంభం

SiliconAndhra Manabadi 2019-20 Classes Begin From Today

ప్రవాస చిన్నారుల పాలిట తెలుగు కల్పవల్లి సిలికానాంధ్ర మనబడి 2019-20 విద్యా సంవత్సరం శనివారం నుండి ప్రారంభమయింది. అమెరికావ్యాప్తంగా 10వేల మందికి పైగా ప్రవాస చిన్నారులు, బాలబాలికలు ఈ తరగతుల్లో తెలుగు భాషా మాధుర్యాన్ని ఔపోసన పట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సిలికానాంధ్ర మనబడిలో ప్రస్తుతం 50వేలకు పైగా విద్యార్థులు తెలుగు భాషను అభ్యసిస్తున్నారు. నూతన విద్యాసంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థినీ విద్యార్థులకు మనబడి నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్, చమర్తి రాజు, కొండుభట్ల దీనబాబు తదితరులు స్వాగతం పలికారు. రిజిస్ట్రేషన్ల ఆఖరు తేదీ సెప్టెంబరు 20. మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

View this post on Instagram

శుభమస్తు – నిర్విఘ్నమస్తు – దిగ్విజయోస్తు!!! 2019-20వ విద్యాసంవత్సరానికి సమయాత్తమవుతూ శంఖారావం పూరిస్తున్న మిచిగన్ మనబడి విద్యార్థులు, ఉపాధ్యాయ సమన్వయకర్తల బృందం! మనబడి అడ్మిషన్లకు చివరితేదీ సెప్టెంబర్ 20, 2019. మీ పిల్లల్ని manabadi.siliconandhra.org ద్వారా వెంటనే నమోదు చేయండి. #ManaBadi #SiliconAndhra #SiliconAndhraManaBadi #Telugu #TeluguLanguage #usatelugu

A post shared by SiliconAndhra ManaBadi (@siliconandhramanabadi) on