Videos

మతిమరుపు చెదరగొట్టే చేపల పులుసు

Fish Beats Alzhemiers | TNILIVE Interesting Food Recipes

అన్నిరకాల ఆహారాల్లోనూ చేపలను రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మంచిదని వారంటున్నారు.
* మతిమరుపు (అల్జీమర్స్) ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని 2016లో అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని తేలింది.
* చేపలను తరచూ తినడం వల్ల వాటిలో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
* చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయనం వివరాలు ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులూ ఏర్పడవు, గుండె జబ్బులూ రావు.
* మహిళల్లో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
* చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు.