Politics

భీమిలిలో ఏపీ రాజధాని సంతోషకరం

Vijayasai Reddy Speaks Of Bheemili As AP Capital

ఏపీ రాజధానిని విశాఖకు తరలించడం వల్ల భీమిలి నియోజకవర్గం బాగుపడుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం భీమిలిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజధాని కార్యకలాపాలతో భీమిలి మహాపట్టణంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ సత్యనారాయణ నేతృత్వంలో భీమిలిలో రాజధాని ఏర్పాటు కానుండడం సంతోషంగా ఉందన్నారు. రాజధానిపై వ్యక్తిత్వం లేని నాయకులు విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.