జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్లదాడి దురదృష్టకరమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమ పార్టీ వారిని అన్యాయంగా ఇబ్బంది పెట్టిపెట్టే ప్రయత్నం చేస్తే..దిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి అండగా నిలుస్తానని చెప్పారు. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి జనసైనికుడు వారికి ధైర్యాన్నిచ్చి బాసటగా నిలవాలన్నారు. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
నేను కాకినాడ వస్తా…తాట తీస్తా
Related tags :