బ్రిటన్ వేరు కాపురం ఆరంభమైంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోవాలన్న ప్రజాభీష్టం నెరవేరింది. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. మూడున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన రెఫరెండంలో 52ు ప్రజలు బ్రెగ్జిట్ వైపే మొగ్గు చూపారు. ఎన్నో అవాంతరాల మధ్య అది చట్టంగా మారడానికి ఇన్నేళ్లు పట్టింది.ఈయూ నుంచి వేరుపడిన తొలి దేశం బ్రిటనే! ఈయూతో 47 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవడం ద్వారా ప్రపంచదేశాలతో సరికొత్తగా వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు అమిత స్వేచ్ఛ లభిస్తుంది. ఈయూ నుంచి వేరుపడటం అంతం కాదని, ఇదో కొత్త ఆరంభమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రిటన్ చరిత్రలో మరో నూతనాధ్యాయం మొదలైందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ పేర్కొన్నారు.
అమలులోకి వచ్చిన బ్రెగ్జిట్
Related tags :