తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెదేపా జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాక్డౌన్ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకొన్నారు. కార్యక్రమంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లపైనే తెదేపా జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు సూచించారు. కరోనా సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
NTRకు చంద్రబాబు నివాళి
Related tags :