Business

Breaking: శుభవార్త-రైల్వే బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి

Indian Railway Bookings To Open For Public

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 నుంచి రైల్వే బుకింగ్‌లు తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

లాక్‌ డౌన్‌ ను పొడగించే అవకాశాలు ఏ మాత్రం లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి శాఖకు స్పష్టమైన సంకేతాలు రావడం తోనే ఈ నెల 15 నుంచి బుకింగ్‌లు ప్రారంభించ నున్నట్లు సమాచారం.

‘‘ఏప్రిల్ 15 నుంచి ఐఆర్‌సీటీసీ నుంచి టిక్కెట్ బుకింగ్స్ అనుమతిస్తాం. లాక్‌ డౌన్ 14 వరకే ఉంది. అందుకే క్రమక్రమంగా తిరిగి పని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది.

ప్యాసింజర్స్ రైళ్లను మెళ్లిగా ప్రారంభిస్తాం. అయితే ప్రయాణికుల ప్రయాణాలు మాత్రం ఏప్రిల్ 15 నుంచే ప్రారంభం కాకపోవచ్చు’’ అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

మరో వైపు విమాన సర్వీసుల బుకింగ్ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇండిగో, స్పైస్ జెట్, గో ఏయిర్ లాంటి సంస్థలు తమ బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు సమాచారం.

అయితే ఆ సంస్థలు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.