Agriculture

జగిత్యాల రైతులపై దోపీడి

Telangana Jagityala Farmers Being Cheated And Exploited

జగిత్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాలీల కొరత, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నా మిల్లర్లు లారీలు దించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిలువునా దోపిడి చేస్తున్నారని వాపోతున్నారు. అకారణంగా ధాన్యం కొలతల్లో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.