ఆసుపత్రిలో ప్రసూతి వార్డులోకి అనుమతించలేదంటూ ఓ గర్భిణి భర్త వైద్యుడి చెవి కొరికాడు. ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర మహారాజా కృష్ణచంద్ర గజపతి (ఎమ్కేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి స్త్రీ రోగ, ప్రసూతి విభాగం వైద్యురాలు భారతి మిశ్ర, వైద్యుడు స్మృతిరంజన్ పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా పురుషోత్తంపూర్ ప్రాంతానికి చెందిన తరిణి ప్రసాద్ మహాపాత్ర్ తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వద్ద ఐదుగురు కుటుంబ సభ్యులుండగా, తానూ ప్రసూతి వార్డుకు వెళ్తానని తరిణి పట్టుబట్టాడు. అందుకు నిరాకరించిన వైద్యుడు స్మృతిరంజన్పై దాడి చేశాడు. అక్కడే ఉన్న పీజీ వైద్యవిద్యార్థి షకీల్ఖాన్, మరో నలుగురు వైద్యులు అడ్డుకోగా షకీల్ ఎడమ చెవి కొరికేయడంతోపాటు మిగిలిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తరిణి ప్రసాద్ను అరెస్టు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ పినాక్ తెలిపారు.
భార్యను చూడనివ్వలేదని చెవి కసకసా కొరికేశాడు
Related tags :