Politics

రుణాలు పెంచండి. రైళ్లు ఆపండి.

KCR Requests Modi To Stop Trains And Rise Loans

ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్‌ చేసి రుణ పరిమితిని పెంచాలి. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి. జులై, ఆగస్టు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. భారత్‌ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.