Editorials

అటు ఇటు వెయ్యి మంది బలగాలు

అటు ఇటు వెయ్యి మంది బలగాలు

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం.

గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌ టీఎస్‌వో వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. వాతావరణం గంభీరంగా ఉంది. కీలక ప్రాంతాల్లో భారత్‌-చైనాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి.

‘‘జూన్‌ 15 తర్వాత అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటివరకూ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. అయితే, ఇరు దేశాల నుంచి ఇటు గల్వాన్‌, అటు పాంగాంగ్‌లలో బలగాలు మోహరిస్తున్నాయి’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న భారత్‌

చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా అడ్డుకునేందుకు భారత్‌ తనకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్‌ టీఎస్‌వో నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్‌ ఆపరేషన్‌ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫింగర్‌ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్‌ అదుపులోనే ఉంది. ఆ ప్రాంతంలో చైనా భారీగా దళాలను మోహరిస్తుండగా, అదే స్థాయిలో భారత్‌ తన శిబిరంలోనూ సైనికులను రంగంలోకి దించుతోంది