ScienceAndTech

ఇక ఇండియన్ పాస్‌పోర్టుల్లో చిప్‌లు

ఇక ఇండియన్ పాస్‌పోర్టుల్లో చిప్‌లు

దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అలానే పాస్‌పోర్ట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చిప్‌ పొందుపరిచిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ‘‘చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల కోసం ప్రస్తుతం మేము ఇండియన్‌ సెక్యూరిటీ ప్రెస్‌ నాసిక్‌, నేషనల్ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ-పాస్‌పోర్ట్ మన ప్రయాణ పత్రాలకు మరింత భద్రత కల్పిస్తుంది. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించాం. ప్రస్తుతం మనకు వీటి అవసరం ఎంతో ఉంది’’ అని మంత్రి అన్నారు.