ScienceAndTech

హీరో లెక్ట్రా…ధర ₹25వేలు

హీరో లెక్ట్రా…ధర ₹25వేలు

ప్రముఖ సైకిల్‌ తయారీ కంపెనీ హీరో సైకిల్స్‌కు చెందిన ఈ-సైకిల్‌ బ్రాండ్‌ హీరో లెక్ట్రో.. కొత్తగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లను విపణిలోకి తీసుకొచ్చింది. లిథియం- ఐయాన్‌ బ్యాటరీతో నడిచే ఈ సైకిళ్లు గరిష్ఠంగా 25 కి.మీ వేగంతో దూసుకెళ్లగలవు. బ్లూటూత్‌ ద్వారా ఈ సైకిళ్లను స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయవచ్చు. దీని ద్వారా స్పీడ్‌, మ్యాప్స్‌, బ్యాటరీ ఛార్జ్‌, మోడ్స్‌, బ్యాటరీ వెళ్లగల దూరం, రైడ్‌ హిస్టరీ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇస్మార్ట్‌ సైకిళ్లను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 25 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు. రకరకాల వినియోగదారుల కోసం వివిధ సదుపాయాలు ఉన్న మూడు రకాల వాహనాలను విపణిలో అందుబాటులో ఉంచినట్లు సంస్థ డైరెక్టర్‌ ఆదిత్య ముంజల్ తెలిపారు. దూర ప్రయాణాలు, ఫిట్‌నెస్‌, సరదా రైడింగ్‌ ఇలా.. ఒక్కో తరహా ప్రయాణాలను కోరుకునే వారికి వీలుగా మూడు విభాగాల మోడల్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ సైకిళ్లలో పెడల్‌, పెడల్‌ విత్‌ ఎలక్ట్రానిక్‌ బూస్ట్‌, ట్విస్ట్‌ అండ్‌ గ్లైడ్‌ థ్రోటల్‌ మోడ్‌, స్థిరంగా 6 కి.మీ వేగంతో వెళ్లే విధంగా మొత్తం నాలుగు మోడ్స్‌ను అందిస్తున్నారు. వీటి ధర రూ.25వేల నుంచి ప్రారంభమవుతోంది. మరిన్ని వివరాలకు కంపెనీ వెబ్‌సైట్‌ సందర్శించండి.