NRI-NRT

ఎన్నారై భూములను రక్షిస్తాం:కేసీఆర్

ఎన్నారై భూములను రక్షిస్తాం:కేసీఆర్

ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల విషయములో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘ఆధార్‌ లేనంత మాత్రాన ఎన్నారైల భూమి పోకూడదు. వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదైనా రుజువు పత్రం తీసుకొని, వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు. ఈ ప్రకటన వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు మేలు జరుగుతుందని తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఆయన ప్రకటన పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.