Politics

నేడు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

నేడు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణలో కొనసాగుతున్న విధానాలు, పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక, వైద్యారోగ్య, విద్యా, అటవీశాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11.30కి సమావేశం ప్రారంభం కానుంది. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఇందులో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. టీకాలు ఈ నెల 12 నుంచి రాష్ట్రానికి చేరనున్నాయి. ఈ క్రమంలో టీకాల నిల్వ, వినియోగం, 16 నుంచి చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళిక, అన్ని రకాల జాగ్రత్త చర్యలపై చర్చించనున్నారు