Politics

ప్రజలకు బాబు ప్రశంసలు

వైకాపా పతనం మొదలైందని, తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తొలి దశలో 2,723 పంచాయతీల్లో పోలింగ్‌ జరగ్గా.. తెదేపా మద్దతుదారులు 1,023 మంది, ఇతరుల మద్దతుతో మరో 32 మంది గెలిచారని తెలిపారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా అనేక అరాచకాలకు పాల్పడినా… తెదేపా మద్దతుదారులు ఘన విజయం సాధించారంటే ప్రజలే కారణమని, నిజమైన హీరోలు వారేనని కొనియాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలొడ్డి పోరాడారని, తెదేపా సత్తా చూపించారని అభినందించారు. వైకాపా పతనానికి ఇది ఆరంభమేనని పేర్కొన్నారు. వైకాపా మద్దతుదారులు 94% పంచాయతీల్లో గెలిచినట్లు మంత్రి బొత్స, 95% గెలిచినట్లు విజయసాయిరెడ్డి చెప్పడం వారి పైశాచిక ఆనందానికి నిదర్శనమన్నారు.