Politics

చంద్రబాబుపై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు

చంద్రబాబుపై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ మరో మూడు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన ధర్మాసనం దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మరోసారి పిటిషన్‌పై విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగిస్తూ తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.