Movies

ఓటీటీలో సేతుపతి-రాశీఖన్నా సినిమా

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగతమిజన్‌’. తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’ టైటిల్‌తో విడుదలైంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అటు కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. ఆ వినోదాన్ని మళ్లీ పంచేందుకు డిజిటల్‌ మాధ్యమం వేదికగా రానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 14లో నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విజయ ప్రొడక్షన్స్‌ పతాకంపై భారతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ చందర్ దర్శకత్వం వహించారు. వివేక్‌ మార్విన్‌ సంగీతం అందించారు. రవి కిషన్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.