మహేశ్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని ఓ కీలక పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మహేశ్ 28’ వర్కింగ్ టైటిల్గా చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతంలో తివిక్రమ్ తెరకెక్కించిన సినిమాలను గమనిస్తే ప్రతి చిత్రంలోనూ ఒకప్పటి సీనియర్ కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించారు. నదియా, స్నేహ, ఖష్బూ, టబు.. ఇలా ప్రతి సినిమాలోనూ కీలక పాత్రల్లో నటిస్తూ కథకు బలం చేకూర్చేలా తీర్చిదిద్దుతుంటారు త్రివిక్రమ్. మరి ఈ చిత్రంలో శిల్ప నటిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూర్చనున్నారని సమాచారం. ఇందులో నాయికగా పూజాహెగ్డేను తీసుకోనున్నారని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. గతంలో పూజా ‘మహర్షి’ కోసం మహేశ్తో కలిసి నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ ‘అతడు’, ‘ఖలేజా’లాంటి సినిమాలు చేశారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. వచ్చే ఏడాది వేసవికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది.
మహేష్తో ఒప్పుకుంటుందా?
Related tags :