తానా 2021 ఎన్నికల్లో సాంస్కృతిక సేవల సమన్వయకర్తగా తెలంగానాలోని కొత్తగూడెంకు చెందిన తూనుగుంట్ల శిరీష గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి తుమ్మల సతీష్పై అభ్యర్థులు అందరూ ప్రచారంపై 1882 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శిరీషకు 11451 ఓట్లు లభించగా, సతీష్కు 9569 ఓట్లు లభించాయి. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆశీస్సులతో, న్యూజెర్సీకి చెందిన తానా ఫైర్ బ్రాండ్ దేవినేని లక్ష్మీ మద్దతుతో ఈ ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు తానా ఓటర్లు పట్టం కట్టడం పట్ల ప్రవాసులు హర్షం వెలిబుచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందరూ అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తే శిరీష మాత్రం తానా తరఫున కోవిద్ సహాయక చర్యలపై సమయాన్ని వెచ్చించడం ఆమెలోని సేవాతత్పరతకు నిదర్శనం.
ఈమె విక్టరీ…తానాకు “సిరి”
Related tags :