NRI-NRT

తానా ఆధ్వర్యంలో “పుస్తక మహోద్యమం”

తానా ఆధ్వర్యంలో “పుస్తక మహోద్యమం”

తానా ఆధ్వర్యంలో “పుస్తక మహోద్యమం” పేరిట సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తానా మీడియా విభాగ అధ్యక్షుడు ఠాగూర్ మలినేని ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శత శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దసరా నుండి సంక్రాంతి వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు కొని వాటిని మిత్రులు, బంధువులు, పిల్లలకు బహుమతులుగా అందజేయడం తద్వారా పుస్తకపఠనం, సాహితీ అవలోకనంపై మక్కువ పెంపొందించడమే ఏ ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పుస్తకాలు అందిస్తూ ఫోటో, పేరు, ఊరు, ఫోను నెంబరు, పుస్తక రచయిత పేరు, ఊరు, పుస్తకం పేరు, పుస్తక గ్రహీత పేరు, ఊరు వివరాలను తానా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి తానా “పుస్తక నేస్తం” ప్రశంసాపత్రాన్ని అందజేస్తుంది.