Health

భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

భారత్‌లో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దాదాపు మూడు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,71,202 కోవిడ్ కేసులు నమోదు అవగా… 1,38,331 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనా బారిన పడి 314 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 15,50,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివ్ రేటు 16.28 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరింది.