DailyDose

బ్రతికి ఉండగానే కూతురుకి పిండం పెట్టిన తండ్రి

బ్రతికి ఉండగానే కూతురు కి పిండం పెట్టిన తండ్రి

ప్రేమపెళ్ళి చేసుకొన్న కూతురికి పిండప్రధానం చేసిన “జనకుడు”.. కూతురు ప్రేమ పెళ్లి చేసుకందన్న కారణంతో కూతురు బ్రతికుండగానే తండ్రి పిండం పెట్టి శ్రద్దాంజలి ఘటించిన సంఘటన, మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేకుంది. చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన (భార్గవి) అనేయువతి.. అదే గ్రామానికి చెందిన బంధువైన వెంకంటేశ్ అనే యువకుడిని ఈ నెల 13న ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కూతురు ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని తండ్రి.. గుండు గీయుంచుకుని దినకర్మ నిర్వహించారు. అనంతరం కూతురు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించాడు. ఈ విషయం గ్రామంలో చర్చానీయాంశమైంది.