DailyDoseNRI-NRT

గూగుల్ కు షాక్ ఇచ్చిన భారతీయుడు

గూగుల్ కు షాక్ ఇచ్చిన భారతీయుడు

ప్రపంచంలో గూగుల్ గురించి తెలియని వారుండరు. ప్రతి విషయానికి గూగుల్ పైనే ఆధారపడుతుంటాము. అలాంటి గూగుల్ సంస్థకు మనదేశానికి చెందిన యువకుడు భారీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ సంస్థ నుంచి భారీ మొత్తంలో రివార్డు పొందాడు. అసలు ఆ యువకుడు ఏవరు? గూగుల్ కు ఆ యువకుడు ఇచ్చిన షాక్ ఎంటో ఇప్పుడు చూద్దాం..మనదేశానికి చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం సొంతగా బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీ స్టార్ చేశాడు. ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్ వేర్ లోని లోపాలను గుర్తించడం ఈ బగ్స్ మిర్రర్ కంపెనీ చేసేది. ఇదే సమయంలో గూగుల్ సంస్థ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలకు సంబంధించిన సాఫ్ట్ వేర్ లో ఏవైన లోపాల్ని గుర్తించిన వారికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా వ‌ల్నర‌బిల‌టీ రివార్డ్ ప్రోగ్రామ్-2021 ను నిర్వహించింది.అయితే ఈ ప్రొగ్రామ్ లో అమన్ పాండే కూడా పాల్గొన్నాడు. గూగుల్, ఆండ్రాయిండ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు మరికొన్ని సాఫ్ట్ వేర్ లలో వందల సంఖ్యల్లో బగ్స్ ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీల‌కు చెందిన ప‌లు సాఫ్ట్‌ వేర్‌ ల‌లో 232 లోపాల్ని గుర్తించాడు. 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి అండ్రాయిడ్‌ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌ లో భాగంగా 280కి పైగా బ‌గ్స్‌ ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు. మన దేశానికి చెందిన అమన్ పాండే.. బ‌గ్స్ ను గుర్తించినందుకు రూ.65 కోట్ల రివార్డ్‌ ను అందిస్తున్నట్లు గూగుల్ త‌న బ్లాగ్ లో పోస్ట్‌ పెట్టింది. ఈ నేప‌థ్యంలో అమ‌న్‌ ను గూగ‌ల్ ప్రత్యేకంగా అభినందించింది.