DailyDose

జగన్ సర్కార్‌కు షాక్

జగన్ సర్కార్‌కు షాక్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఒకింత జగన్ సర్కార్‌కు కోర్టు మొట్టికాయలేసింది.సర్కార్‌కు డెడ్‌లైన్..భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్ లైన్ కూడా విధించింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్ సర్కార్‌కు కోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు సూచించింది.