పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈయన ఎంపిక జరిగింది. విపక్షాలన్నీ ఏకగ్రీవంగా షెహబాజ్కు మద్దతు తెలిపాయి. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి వాకౌట్ చేశారు.
పాకిస్థాన్ నూతన ప్రధానిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విపక్షాలు ఈయన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. 342 అసెంబ్లీ స్థానాలు గల పాక్ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి 172 సీట్లు కావాల్సి ఉండగా.. షెహబాజ్కు 174 మంది మద్దతు తెలిపారు. దీంతో ఆయన ప్రధాని పదవికి ఎంపికయ్యారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ అజెండాలో భాగంగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో భాగస్వామిని కాబోమని, స్వేచ్ఛ కోసం పోరడతామని స్పష్టం చేశారు. ఓటింగ్కు ముందే సభ నుంచి వాకౌట్ చేశారు. పీటీఐ పార్టీకి తాను ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినా.. ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు సభను వీడే ముందు చెప్పారు షా మెహ్మూద్ ఖురేషి.
*ఎవరీ షెహబాజ్?
షెహబాజ్ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్లో జన్మించారు. షెహబాజ్ తండ్రి ముహమ్మద్ షరీఫ్ స్వస్థలం కశ్మీర్ (భారత్)లోని అనంతనాగ్. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్ లాహోర్లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు షెహబాజ్ షరీఫ్ స్వయానా తమ్ముడు. షెహబాజ్ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.షెహబాజ్ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు.బ్రిటన్లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్పై ఉంది.1980లో రాజకీయాల్లో ప్రవేశం. 1988లో మొదటిసారి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక. 1997లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు. మూడు సార్లు పంజాబ్ సీఎంగా బాధ్యతలు.2017లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు. 2018 సార్వత్రిక ఎన్నికలతో జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారారు.పాక్లో సైన్యంతో షెహబాజ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అది ఆయనకు కలిసొచ్చే అంశం.యథార్థవాది. ముక్కుసూటి మనిషి. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ఈ మాటలు పాకిస్థాన్ ప్రజలు షెహబాజ్ షరీఫ్ గురించి చెప్పుకొనే మాటలు.
*దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్ కంటే..
వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్ షరీఫ్ హయాంలో భారత్ – పాక్ సంబంధాలు ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్కు సన్నిహితుడైన పాకిస్థాన్ ముస్లింలీగ్-ఎన్ నేత సమీవుల్లాఖాన్ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్ సోదరుడైన నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని హోదాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడేనా?.. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్ కంటే వాస్తవికత దృక్ఫథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్ షరీఫ్ హయాంలో భారత్-పాక్ సంబంధాలు ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్కు సన్నిహితుడైన పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేత సమీపుల్లా ఖాన్ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్ సోదరుడైన నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని హోదాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.చైనాతో సంబంధాలు ఎలా?..: చైనా, పాకిస్థాన్ సంబంధాలు ఇమ్రాన్ఖాన్ హయాంలో కంటే షెహబాజ్ షరీఫ్ పాలనలో మరింత మెరుగ్గా ఉంటాయని బీజింగ్ అధికారిక పత్రిక పేర్కొంది. పాక్లో సోమవారం షెహబాజ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఆదివారం ఈ కథనాన్ని ప్రచురించింది. పాక్లో నాయకత్వ మార్పు ఆ దేశ అంతర్గత వ్యవహారమని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పార్టీలన్నిటి వైఖరి ఒకేలా ఉంటుందని అభిప్రాయపడింది. ఇమ్రాన్ఖాన్ స్థానంలో అధికారం చేపట్టనున్న ‘షరీఫ్’ కుటుంబానికి చెందిన షెహబాజ్ గతంలో మాదిరిగా పాక్ – చైనా సంబంధాలను ముందుకు తీసుకువెళతారని తెలిపింది.