Movies

మిస్ ఇండియా పోటీలో శివాని రాజశేఖర్..

Auto Draft

టాలీవుడ్ సీనియర్‌ హీరో డా.రాజశేఖర్‌, జీవిత దంపతుల పెద్ద కుమార్తె, యంగ్ హీరోయిన్ శివాని ‘ఫెమినా మిస్‌ ఇండియా 2022’ పోటీలో పాల్గొనబోతుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సోమవారం ఆడిషన్స్‌కు హాజరయ్యాయని, తన వంతుగా ఉత్తమ ప్రదర్శన కూడా ఇచ్చినట్టు శివాని తెలిపింది. ఇక తాను ‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని.. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో పాల్గొంటున్న ఇతర రాష్ట్ర మహిళలకు కూడా శివానీ ఈ సందర్భంగా బెస్ట్‌ విషెస్‌ను తెలిపింది.కాగా, శివానీ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీలో వచ్చి ఆకటుకుంది. మరోసారి ఓటీటీ కోసమే ‘డబ్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ మూవీ చేసి ఆకట్టుకుంది. ఓటీటీ కోసం అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్‌లో మాత్రం ఆశించిన అవకాశం రావడం లేదు. ఇక తండ్రి రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’లో శివానీ అతిథి పాత్రలో కనిపించబోతోంది. మేలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.