Politics

ఒంగోలులో మే 27 నుంచి టీడీపీ మహానాడు

ఒంగోలులో మే 27 నుంచి టీడీపీ మహానాడు

ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మహానాడు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల నియామకం నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేయనున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఎన్నికల కారణం, రెండు ఏళ్ళు కోవిడ్ కారణంగా మాహానాడు ఆన్ లైన్ కే పరిమితమైంది.