లోక కల్యాణం కోసం ఉద్భవించిన శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని ఖండాంతరాలు దాటి నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళికను సిద్ధం చేసింది. కొవిడ్ కు ముందు పలు దేశాల్లో స్వామివారి ఉత్సవాలను నిర్వహించిన టీటీడీ ఈ సారి అమెరికాలో జరుపాలని నిర్ణయించింది. అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో జూన్ 18 నుంచి జులై 3 వతేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంట్లో భాగంగా జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియోటెల్, 25న డల్లాస్, 26న సేయింట్ లూయిస్, జులై 3న వాషింగ్టన్ డీసీ, జులై 5న న్యూ ఒరియన్స్లో కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీకి చెందిన బోర్డు సభ్యులు, అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవంలో పాల్గొంటారని వివరించారు.