NRI-NRT

న్యూజిలాండ్ లో తెలంగాణా అవతరణ వేడుకలు

న్యూజిలాండ్ లో తెలంగాణా అవతరణ వేడుకలు

న్యూజీలాండ్ లో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తెలంగాణ తెరాస పార్టీ న్యూ జీలాండ్ శాఖ ఆధ్వర్యంలో 8వ రాష్ట్ర అవతరణ దినోత్సవం వెస్లీ కమ్యూనిటీ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమం న్యూజీలాండ్ తెరాస శాఖ అధ్యక్షులు శ్రీ జగన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా అమరులకు నివాళులు  అర్పించి, రాష్ట్ర గీతం ఆలపించారు. జగన్ గారు  మాట్లాడుతూ ఉద్యమం నుంచి నేటి వరకు కెసిఆర్ పాత్ర, పార్టీ పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతంలో ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాష్, హోనోరారి చైర్ పర్సన్, నర్సింగ రావు ఇనగంటి, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ పోకల ప్రముఖ పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా తెరాస శాఖ, వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన, ట్యాంజు వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ రావు కాసుగంటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మోహన్  రెడ్డి బీరపు, పానుగంటి శ్రీనివాస్, గిరిధర్  మోర్ల, వ్యాపారవేత్తలు, కృష్ణ కుమార్ పూసర్ల  శ్రీని  తదితరులు పాల్గొన్నారు.
IMG-20220605-WA0100