Politics

పిడుగు లాంటి వార్త రావచ్చు-తుమ్మల

పిడుగు లాంటి వార్త రావచ్చు-తుమ్మల

సిద్ధం కండి .. ఏక్షణమైనా పిడుగులాంటి వార్త వినొచ్చు అని మాజీ మంత్రి, తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులతో అన్నారు. గతంలో తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండని కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన సందర్భంగా తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, కార్యకర్తలను పూర్తి స్థాయిలో కలవలేకపోయానని చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని.. ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.