NRI-NRT

GWTCS-చేతనా ఫౌండేషన్ నిధుల సేకరణ

GWTCS-చేతనా ఫౌండేషన్ నిధుల సేకరణ

GWTCS-చేతనా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో నిధుల సేకరణ, యోగా కార్యక్రమాలను నిర్వహించారు. చేతనా ఫౌండేషన్‌ ద్వారా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పేద విద్యార్థినీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా వ్యాక్సినేషన్‌తో పాటు మందులు అందించారు.ఆయా సేవా కార్యక్రమాల నిర్వహణకు నిధుల సేకరణ చేపట్టారు. మన్నవ సుబ్బారావు, చేతనా ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీలత నార్ల, GWTCS అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, నరేన్‌ కొడాలి,సత్య సూరపనేని, రమాకాంత్‌ కోయ తదితరులు పాల్గొన్నారు.