Rahul Gandhi: ఏపీకీ అమరావతే రాజధాని
Kurnool: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్
గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని రాహుల్కు వివరించారు. పోలవరం నిర్వాసిత రైతులకు అండగా ఉంటానని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే అర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని భరోసా ఇచ్చారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా.. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు.