ఇటీవల బెంగళూరులో జరిగిన ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదాన కార్యక్రమానికి నందమూరి నటరత్నం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి, విద్యావేత్త సుధామూర్తితో పాటు కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని కూడా విచ్చేశారు. ఆ ఇద్దరూ వేదిక మీదికి రావడంతో గౌరవ సూచకంగా లేచి నిలబడి, మర్యాద పూర్వకంగా పలకరించాడు ఎన్టీఆర్. కూర్చోమంటూ తన కుర్చీ చూపించాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో తడిసిన కుర్చీని కర్చిఫ్తో తానే తుడిచి.. అశ్విని, సుధామూర్తి ఆసీనులైన తర్వాతే తాను కూర్చున్నాడు. ఈ వీడియోను చూసి ఎన్టీఆర్ను వినయ విధేయ రాముడని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.