NRI-NRT

అనాధ బాలికలకు ₹6లక్షలు అందజేసిన పురుషోత్తం చౌదరి

అనాధ బాలికలకు ₹6లక్షలు అందజేసిన పురుషోత్తం చౌదరి

అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల మధుసూదన్ చౌదరి, పద్మక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. పెదనాన్న సంరక్షణలో పెరుగుతున్న వీరి ఇరువురు కుమార్తెలకు ఒక్కొక్కరికీ ₹3లక్షల చొప్పున ₹6లక్షల మొత్తాన్ని ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తమ చౌదరి అందజేశారు. భవిష్యత్‌లో కూడా ఈ చిన్నారుల అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జ్ఞానభారతి విద్యాసంస్థల అధినేత రమేష్ బాబు, కొండయ్య, అచ్ఛంపల్లి రమేష్, కొల్లి వెంకటేష్ చౌదరి, వెంకట్(అమెరికా) తదితరులు పాల్గొన్నారు.