Devotional

టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ.

టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ.

టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ

      టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.

      అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం, జెఈఓ శ్రీమతి సదా భార్గవి కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

         ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు శ్రీమతి కస్తూరి బాయి, శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
           
————————————————————-
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.