Politics

టీడీపీకి ఈ ఎలక్షన్స్ సెమీ ఫైనల్స్

టీడీపీకి ఈ ఎలక్షన్స్ సెమీ ఫైనల్స్

విశాఖ జిల్లా టీడీపీ నేతలకు పెద్ద సవాల్‌ ఎదురవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్‌గా పరిగణిస్తోంది. టీడీపీకి మంచి బ‌లం ఉంద‌ని ప్ర‌జ‌ల‌కు చూపించి అదే స‌మ‌యంలో వైసీపీ ఆధిప‌త్యాన్ని బ‌ట్టి కొట్టే ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఆ పార్టీకి ఎంతైనా ఉంది.
ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావును బరిలోకి దింపింది.ఆయన నామినేషన్ ఓకే అయింది. అయన గెలుపు కోసం పార్టీ ఎలాంటి రాయిని వదలలేదు.ముఖ్యంగా వైజాగ్ సౌత్ నియోజక వర్గంలోని ఆ పార్టీ క్యాడర్ ఎమ్మెల్సీ సీటును టీడీపీ అభ్యర్థిని గెలిపించేలా చూడాలనే పట్టుదలతో ఉంది.
గండి బాబ్జీ,ఎంపీ అభ్యర్థి,బాలకృష్ణ అల్లుడు ఎం.శ్రీ భరత్ కూడా దీన్ని సీరియస్ టాస్క్‌గా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా,తమ పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టాలని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు.
అందుకు తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలకు తెలియజేయడంపై టీడీపీ దృష్టి సారిస్తోంది.అందులో భాగంగానే వేలాది మంది స్కిల్డ్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారనే విషయాన్ని హైలెట్ చేయాలని పార్టీ నిర్ణయించింది.ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ చేస్తున్నట్లే వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.వైసీపీ అధికారంలో ఉన్నందున,ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం సాధించేందుకు పార్టీ క్యాడర్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.విశాఖ జిల్లా టీడీపీ నేతలకు పెద్ద సవాలే అంటున్నారు.