Politics

వెంకయ్య నాయిడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన గవర్నర్

వెంకయ్య నాయిడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన గవర్నర్

పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నివాసంలో సోమవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నాయిడు ఇంట ప్రతి సంవత్సరం అతిరధ మహారధుల సమక్షంలో నూతన సంవత్సరాది వేడుకలను ఘనంగా జరుపు కోవటం అనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , పలువురు కేంద్ర మంత్రులు, డిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్యసభ పూర్వ సభ్యుడు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు వెంకయ్య నాయుడు పరిచయం చేసారు. బహుభాషా కోవిదునిగా యార్లగడ్డ దేశ ప్రజలకు సుపరిచితులని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా సేవలు అందించారని వివరించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో తామిద్దరు కలిసి పనిచేసామని గవర్నర్ కు వెంకయ్య నాయిడు తెలిపారు.