ScienceAndTech

గూగుల్ పే, ఫోన్పే యూజర్లూ జాగ్రత్త! సరికొత్త మాల్వేర్తో డబ్బు చోరీ

గూగుల్ పే, ఫోన్పే యూజర్లూ జాగ్రత్త! సరికొత్త మాల్వేర్తో డబ్బు చోరీ

రూ. కోటి నష్టపోయిన 81 మంది యూజర్లు

న్యూఢిల్లీ: గూగుల్పే, ఫోన్పే వంటి యూపీఐ

యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎక్స్ పర్టులు చెబుతున్నారు. బ్యాంక్ కేవైసీ, పాన్ స్కామ్ ద్వారా గడచిన 16 రోజుల్లో 81 మంది ముంబైవాసుల నుంచి నేరగాళ్లు రూ. కోటిని దో చుకున్నారు. మోసగాళ్లు గూగుల్పే లేదా ఫోస్పే గేట్వేని ఉపయోగించి కొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందంటే… వీళ్లు గూగులే ్ప లేదా ఫోన్పే ద్వారా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బు పంపుతారు. పొరపాటున డబ్బును పంపించామని, తిరిగి పంపించాలని బతిమాలుతారు. మనం సంబంధిత గూగుల్ పే లేదా ఫోన్పే నంబరు డబ్బును తిరిగి పంపుతాం. ఇదే సమయంలో మాల్వేర్ బారిన పడతాం. ఢిల్లీకి చెందిన సైబర్ ఎక్స్పర్ట్ పవన్ దుగ్గల్ మాట్లాడుతూ “ఇది మాల్వేర్తో కూడిన మానవ ఇంజనీరింగ్ స్కామ్. సైబర్ క్రిమిన ల్స్ గూగుల్పే లేదా ఫోన్పే గేట్వే ద్వారా మీ ఖాతాకు డబ్బును పంపుతారు. మీరు డబ్బును వాపసు పంపితే, మీ ఖాతా హ్యాక్ అవుతుంది” అని వివరించారు. గూగుల్ప లేదా ఫోన్ పే యూజర్ డబ్బును తిరిగి చెల్లించినప్పుడు, మొత్తం డేటా, పాన్, ఆధార్ మొదలైనవన్నీ మో సగాడికి అందుబాటులోకి వస్తాయి. ఈ డాక్యు మెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాను హ్యాక్ చేస్తారు. మాల్వేర్ ఫిషింగ్, హ్యూమన్ ఇంజనీరింగ్ పద్దతిలో ఈ మోసం జరుగుతుంది కాబట్టి ఫోన్ లోని యాంటీమాల్వేర్ సాఫ్ట్వేర్లు కూడా ఏమీ చేయలేవు.