Sports

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం….

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా  విజయం….

ఓవల్ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను స్మిత్ (121), ట్రావిస్ హెడ్ (163) భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. బదులుగా భారత్ 296 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జడేజా (48), రహానే (89), శార్దుల్ ఠాకూర్ (51) ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 270/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. దీంతో ఐసీసీ ట్రోఫీలన్ని నెగ్గిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.