Politics

పోలవరం నిర్వాసితుల సమస్యలపై 5న చర్చలు

పోలవరం నిర్వాసితుల సమస్యలపై 5న చర్చలు

పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సంబంధిత ఉన్నతాధికారులతో ఈనెల 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం రాష్ట్ర నాయకులు తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర, ఈనెల 4న విజయవాడలో మహాధర్నాతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం శనివారం మంత్రి అంబటి రాంబాబును గుంటూరులో కలిసి నిర్వాసితుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించింది. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈనెల 5న సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం ప్రతినిధి బృందం తెలిపింది.