ఎంపీ బండి సంజయ్కు బ్రేక్ వేసింది ఆ పార్టీ అధిష్టానం. ఆయనపై కొన్నాళ్లుగా వినిపిస్తున్న విమర్శలు నిజం అయ్యాయి. దీంతో బండిపై బీజేపీ వేటు వేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సంజయ్ను తొలగించింది. కొత్తగా ఆ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. ఇటీవల బండి సంజయ్కు వ్యతిరేకంగా ఈటెల వర్గం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజుల నుంచి బండికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బండి అడ్డగోలుగా సంపాదిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై బీజేపీ వేటు వేసినట్లు తెలుస్తోంది.ఇక ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షుల్ని మార్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా డీ.పురంధేశ్వరిని నియమించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సీఎం బాబూలాల్ మరాండీకి దక్కాయి. ఇక పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జక్కర్ను నియమించారు. రాజస్థాన్ బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నియమించారు.