Devotional

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్తమండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో బంధించినట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతతో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది. అప్పటినుంచి అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.