Politics

అవినీతి గురించి రాహుల్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కేటీఆర్‌

అవినీతి గురించి రాహుల్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కేటీఆర్‌

అవినీతి గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.టికెట్లు అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్‌ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటివారు కాంగ్రెస్‌లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో? పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్‌.. అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదం’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z