గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సంగీత విభావరికి వేలాది మంది తరలివచ్చారు. గచ్చిబౌలి సైబర్ టవర్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబుకు కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ఈ సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు.నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ నిర్మాత బండ్ల గణేష్, శేరిలింగంపల్లి భారాస ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, ఏబీ వెంకటేశ్వరావు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
👉 – Please join our whatsapp channel here –