Devotional

యాదాద్రిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి సత్యనారాయణ వ్రతం

యాదాద్రిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి సత్యనారాయణ వ్రతం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా సోమవారం(27న) సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు ఎనిమిది విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి వ్రతం నిర్వహిస్తారు. ముందస్తుగా టికెట్ల విక్రయం, పూజా సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో గీత తెలిపారు. ఆదివారం జరిగిన సామూహిక వ్రతాల్లో 1099 మంది దంపతులు పాల్గొన్నారు. వ్రతాలతో ఆలయానికి రూ.8,79,100 ఆదాయం చేకూరింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z