జిల్లా భోగాపురం మండలం ముక్కాం సముద్ర తీరంలో లాబ్స్టర్లాంటి పెద్ద రొయ్యలు చిక్కాయి. వీటిని స్థానిక మత్స్యకారులు ‘ఆరొయ్య, ‘ఆల్ రొయ్య’ అని పిలుస్తున్నారు. వాసుపల్లి ఎర్రయ్య వలకు ఇవి చిక్కాయి. సముద్రం లోతుల్లో రాళ్లను ఆసరాగా చేసుకొని ఉండే ఈ రొయ్యలు అరుదుగా మాత్రమే బయటికి వస్తాయి. ఆ సమయంలో వలల్లో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. రుచిగా ఉండటంతో కేజీ రూ.1500 నుంచి రూ.2వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –