అయోధ్యలోని రామమందిరంలో ఉంచే పాదుకలను హైదరాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహశిల్పి పిట్లంపల్లి రామలింగచారి తయారు చేశారు. ఇందుకోసం 15 కిలోల పంచలోహాలు వాడటంతో పాటు వెండి, బంగారు తాపడం చేసినట్లు ఆయన తెలిపారు. వీటి తయారీకి సుమారు 25 రోజులు పట్టిందని పేర్కొన్నారు. ఈ పాదుకలను అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చర్ల శ్రీనివాసశాస్త్రి ఆధ్వర్యంలో తయారు చేయించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z