Devotional

రేపటి నుంచి మల్లన్న జాతర ప్రారంభం

రేపటి నుంచి మల్లన్న జాతర ప్రారంభం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం వార్షికోత్సవాలకు సిద్ధమైంది. సం క్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌ వారం, మహా శివరాత్రి రోజున పెద్ద పట్నం, అగ్నిగుండాలు నిర్వహిస్తారు.

ఈనెల 21 పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పట్నం వారానికి హైదరాబాద్‌ నుంచి 50 వేల మంది వస్తారు. హైదరాబాద్‌ భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించి, పట్నం వారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దీక్షలను విరమిస్తారు. ఈనెల 22న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహిస్తాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z